కార్వేటినగరం ఆగస్టు 5 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో భరణి కృతిక సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్, కార్యనిర్వక కార్యదర్శి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు గోవిందస్వామి, ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, వినయ్, అమరావతి, సెల్వి, తులసి, గ్రామం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు పాల్గొన్నారు
