ePaper
Monday, August 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బోయకొండ భవానీ నగర్‌లో పేకాట శిబిరంపై దాడి: 24 మంది అరెస్ట్, ₹5 లక్షల...

బోయకొండ భవానీ నగర్‌లో పేకాట శిబిరంపై దాడి: 24 మంది అరెస్ట్, ₹5 లక్షల నగదు స్వాధీనం

📰 Generate e-Paper Clip

​చౌడేపల్లి: ఆగస్టు 23 గరుడ దాత్రి న్యూస్

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పరిధిలోని బోయకొండ భవానీ నగర్‌లో బహిరంగంగా నిర్వహిస్తున్న భారీ పేకాట శిబిరంపై రూరల్ సర్కిల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 24 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు చౌడేపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సాయి ప్రసాద్ తెలిపారు.
​దాడి వివరాలు:
బోయకొండ భవానీ నగర్‌లోని డిష్ సూరి రూముల వెనుక భాగంలో వీధి లైటు వెలుగులో పేకాటాడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో చౌడేపల్లి సబ్-ఇన్స్పెక్టర్ జి. చిన్న రెడ్డెప్ప, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మరియు హోంగార్డుల బృందం ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించింది.
​స్వాధీనం చేసుకున్న సొత్తు:
​నగదు: ₹5,03,000/- (ఐదు లక్షల మూడు వేల రూపాయలు)
​వాహనాలు: 3 కార్లు
​మొబైల్స్: 18 సెల్ ఫోన్లు
​ఇతరాలు: 52 పేక ముక్కలు, ప్లాస్టిక్ సంచి
​ముఖ్య నిర్వాహకులు & నిందితులు:
ఈ జూద శిబిరంలో సత్యసాయి, అనంతపురం మరియు కడప జిల్లాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా:
​A-1: ఎం. ఆదినారాయణ (37) – ధర్మవరం టౌన్, శ్రీ సత్యసాయి జిల్లా
​A-5: కొమ్మగాని భాస్కర్ (43) – ధర్మవరం టౌన్, శ్రీ సత్యసాయి జిల్లా
​A-21: గుజ్జల నడిపి పెద్దన్న (52) – నార్పల మండలం, అనంతపురం జిల్లా
​వీరిని ప్రధాన నిర్వాహకులుగా గుర్తించారు. నిందితులపై చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 76/2026, U/Sec. 9(I) AP Gaming Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!