ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమాజీ గవర్నర్ తమిళిసైకి మరో సారి ఎన్నికల్లో ఎదురుదెబ్బ

మాజీ గవర్నర్ తమిళిసైకి మరో సారి ఎన్నికల్లో ఎదురుదెబ్బ

📰 Generate e-Paper Clip

తమిళనాడులో ప్రముఖ రాజకీయ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరుసగా ఏడోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె, టీవీకే అభ్యర్థి పి. వెంకటరామనన్ చేతిలో పరాజయం చవిచూశారు.ఇది ఆమె రాజకీయ ప్రయాణంలో మరో నిరాశగా మారింది. గతంలో 2019లో తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళిసై, డీఎంకే నేత ఎం. కరుణానిధి చేతిలో ఓటమి చెందారు. అనంతరం నాలుగు నెలల్లోనే ఆమెను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.తమిళిసై గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. 2006లో రాధాపురం అసెంబ్లీ, 2009లో చెన్నై నార్త్ లోక్‌సభ, 2011లో వేలచేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ, 2024లో చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఇలా వరుసగా ఏడు ఎన్నికల్లో పరాజయం పొందడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!