తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని, మన సంప్రదాయాల వైభవాన్ని తన అద్భుతమైన కవితా శిల్పంతో సజీవంగా ఆవిష్కరించి, సాహిత్యరంగంలో విశిష్టమైన సేవలను అందిస్తూ, పాఠక హృదయాలను అలరిస్తున్న శ్రీమతి మంజుల పత్తిపాటి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ
స్నేహం అనే పవిత్ర బంధానికి ప్రతీకగా నిర్వహించిన జులై 30 స్నేహితుల దినోత్సవం సందర్భంగా, తెలుగు భాషా–సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయకమైన కవిత్వాన్ని రచించిన మీ సాహిత్య ప్రతిభను, సాంస్కృతిక నిబద్ధతను గౌరవిస్తూ “మిత్ర రత్నావళి” బిరుదును
విజయవాడలో ఆగష్టు 2 తేదీ హనుమంతరాయ గ్రంథాలయoలో
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ వారు అత్యంత గౌరవంతో ప్రదానం చేయడంజరిగింది.
శ్రీమతి మంజుల పత్తిపాటి గారికి మిత్ర రత్నావళి బిరుదు ప్రదాన సత్కార పత్రం
RELATED ARTICLES
