చౌడేపల్లి ఆగస్టు 03 గరుడ దాత్రి న్యూస్
మండల కేంద్రమైన అన్నమయ్య జిల్లాచౌడేపల్లి గ్రామంలో శ్రీ పబీష్టద మృత్యుంజయశ్వర స్వామి వారి ఆలయంలో వెలసియుండు శ్రీ వళ్ళీ దేవ సేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారికి భరణి, కృత్తిక, పుష్పకావిల్లు 6-8-26 ,7-8-26, తేదీలలో అనగా గురువారము, శుక్రవారము రోజులలో ఉదయం 11-00 గంటలకు పుష్పకావిల్లు చెల్లించబడును.6-8-26 తేదీ గురువారము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి వారి కళ్యాణోత్సవము జరుపబడును. మరియు 7-8-26 తేదీన శుక్రవారం రాత్రి నెమలి వాహనంపై శ్రీ సుబ్రమణ్య స్వామి ఊరేగింపు శ్రీ బెల్లాల శ్రీనివాసులు $బ్రదర్స్ వారిచే జరుపబడును పై కార్యక్రమంలో డా. స్థానికం రాజశేఖర్ దీక్షితులు వారి అర్జకత్వమున నిర్వహించబడును అని దేవాదాయ ధర్మాదాయ ఆలయ కార్యనిర్వాహణాధికారి p. రమణ తెలియజేశారు
