ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సూళ్లూరుపేట, తడ ఎంపీడీవోలపై సస్పెన్షన్ వేటు..!

సూళ్లూరుపేట, తడ ఎంపీడీవోలపై సస్పెన్షన్ వేటు..!

📰 Generate e-Paper Clip

-స్వచ్ఛ రథాల నిర్వహణలో నిర్లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల పారిశుధ్య పర్యవేక్షణలో మరియు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, తడ మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులను (MPDOs) సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో సూళ్లూరుపేట ఎంపీడీవో ఏవీ మురళీకృష్ణ, తడ ఎంపీడీవో డి. శేఖర్ నాయక్ ఉన్నారు.

వైఫల్యాలే కారణం:

గ్రామాల్లో పారిశుధ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ రథాల’ ఏర్పాటు, పర్యవేక్షణ, మరియు క్షేత్రస్థాయి విధుల్లో వీరు తీవ్ర అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో రుజువైంది. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ, విధుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో క్రమశిక్షణా చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

అధికారుల్లో కలకలం:
ప్రభుత్వ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సస్పెన్షన్ ద్వారా ఉన్నతాధికారులు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఈ హఠాత్ పరిణామం ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల అధికార యంత్రాంగంలో తీవ్ర కలకలం రేపింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!