బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు4
మహతి ఫౌండేషన్ మరియు శాంతి హెల్త్ కేర్ ప్రియాంక ఆధ్వర్యంలో మంగళవారం 20 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రోటీన్ పౌడర్ మల్టీ విటమి న్ సిరప్ మాస్కులు టాబ్లెట్స్ మొదలగునవి వైద్యాధికారి విజయ చందర్ పంపిణీ చేశారు.అలాగే పర్యావరణ పరిరక్షణ లో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణములో మొక్కలు నాటించారు.సేవాదాతకు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ప్రతినెలా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది,టి.బి.సుపర్ వైజర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
