శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలకు దానంగా వచ్చిన 9 ఏళ్ల మగ తెల్ల గుర్రం శనివారం కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో మృతి చెందింది. మధురైకి చెందిన షణ్ముగం ఈ గుర్రాన్ని దానంగా ఇచ్చారు. గోశాల వైద్యులు అన్ని రకాల చికిత్సలు అందించినట్లు డైరెక్టర్ డా.శివకుమార్ తెలిపారు. పశువైద్య విశ్వవిద్యాలయ నిపుణుల బృందంతో శవపరీక్ష నిర్వహించి, నమూనాలను ల్యాబ్కు పంపిన అనంతరం గుర్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశారు.
