కుప్పం,జులై 30 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఎన్.ఎస్. తులసి నాథ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కుప్పం నియోజక వర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన సీఎం సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. శాంతిపురం మండలం శివపురంలోని స్వగృహంలో ఆయన నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
