బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు1
ముర్రుపాలు శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీకా అని బైరెడ్డిపల్లి పి.హెచ్ .సి.విద్య వైద్యాధికాణి సావిత్రి పేర్కొన్నారు.తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బైరెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ 1నందు ఆమె తల్లులకు అవగాహన కల్పిస్తూ తల్లిపాలు అమృతం. కాన్పు అయిన గంట లోపే ముర్రుపాలు తాగించాలి ఇది శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీకా, తల్లిపాలు వలన శిశువుకు మేధస్సు పెరుగును శారీరకంగా దృఢంగా ఉంటారు అన్నారు.అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటారు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగును .మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలి తర్వాత అనుబంధ ఆహారం ఇవ్వాలి,తల్లికి రొమ్ము క్యాన్సర్ రా కుండా నివారించ బడును తల్లి బిడ్డకు అనుబంధం పెరుగును గర్భ నిరోధక కం గా కూడా ఉపయోగపడును ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నిర్మలమ్మ, దీప ఆశ ముబీన తదితరులు పాల్గొన్నారు.
ముర్రుపాలు శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీక
RELATED ARTICLES
