అర్ధరాత్రి వరకు అలయంవద్ద ఎన్నడులేనివిధంగా క్రిక్కిరిసిన భక్తజనసందోహం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు12
బైరెడ్డిపల్లి గ్రామదేవత శ్రీ భాటగంగమ్మ తల్లి ఆలయంలో బుధవారం రాత్రి అమ్మవారికి ఆషాడ అమావస్య
పూజ వేడుకలు ఘనంగా
నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం రాహుకాల సమయంలో అమ్మ వారికి పంచామృత అభిషేకం,విశేష పూజాలను అర్చకులు నాగేంద్రస్వామి బృందం చే కొనసాగింది. ఆలయం వద్ద రాత్రి కొనసాగిన భద్రకాళి మరియు అఘోరీ కళా నృత్యం లు భక్తులకు కనువిందు చేసాయి. ఆలయ చరిత్రలో ఎన్నాడులేనివిధంగా అర్ధరాత్రి వరకు భక్త జనసందోహం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, మహామంగళహారతి చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
