కార్వేటి నగరం ఆగస్టు 23 గరుడ దాద్రి న్యూస్
తెలుగుదేశం పార్టీ తోనే మండలం అభివృద్ధి జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు చంగల్రా యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్,డా వి ఎమ్ థామస్ ఆదేశాల మేరకు, క్లస్టర్ ఇంచార్జీ నాగేశ్వర రాజు గారి సూచనలతో కార్వేటినగరం మండలంలో 14 వ యూనిట్ ఇంచార్జీ నగరం సోమశేఖర్ ఆధ్వర్యంలో 95 వ బూత్ కన్వీనర్ మార్టిన్, కో క్లస్టర్ ఇంచార్జీ చిరంజీవి సహకారంతో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్ , టిడిపి నాయకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
