రామ్మోహన్ సతీమణి ప్రమీల కన్నుమూత
గరుడధాత్రి న్యూస్ :
హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జర్నలిస్టు నిమ్మరాజు రామ్మోహన్ సతీమణి శ్రీమతి ప్రమీల (64) గుండెపోటుతో గురువారం రాత్రి ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చలపతిరావు (సీనియర్ జర్నలిస్ట్), బాలసుబ్రహ్మణ్యం (సచివాలయం ప్లానింగ్ విభాగం) ఎన్ జి బి ఎం కృష్ణ (పవర్ గ్రిడ్) రామ్మోహన్ సోదరులు. ప్రమీల మహోన్నత ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, ఆమె లేని తీరనిలోటును భరించే శక్తిని, ధైర్యాన్ని తమ అన్నయ్యకు, కుటుంబ సభ్యులందరికి ప్రసాదించాలని ఆ భగవంతున్ని వీరు ప్రార్థించారు.
