గరుడధాత్రి : కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లు, సమాచార బుక్లెట్ను టీటీడీ ఈవో ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణ, కార్యక్రమాల వివరాలు, భక్తులకు అందుబాటులో ఉండే సౌకర్యాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఈ పోస్టర్లు, బుక్లెట్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు.
