కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరంలోని స్కంద పుష్కరిణి సమీపం వద్ద కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికను రాష్ట్ర విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆవిష్కరించారు. ఆగస్టు నెల ఐదు నుండి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎండోమెంట్ ఈవో కృష్ణ నాయక్, ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, డైరెక్టర్లు వై రాధాకృష్ణ, గోవిందస్వామి, జగన్నాథం, వినయ్, సెల్వి, హరి కుమార్, ఆలయ మాజీ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, వడంగాడు రాజా, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
