పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పట్టణంలోని నాగమంగళంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ విని గ్రాండ్ హోటల్ ను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. పలమనేరు మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సముద్ర పల్లి బాలాజీ నాయుడుకు చెందిన ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తోపాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు. గతంలో గుడియాత్తం రోడ్డులో విని డాబాను నిర్వహించిన బాలాజీ నాయుడు ప్రస్తుతం విని గ్రాండ్ పేరిట మంచి శాఖాహార భోజన హోటల్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ గౌడ్, నాగరాజు రెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు,బాబు నాయుడు,రామచంద్ర నాయుడు, వెంకట ముని రెడ్డి, పెద్దబ్బా, రామ్మూర్తి నాయుడు, గిరి తదితరులు పాల్గొన్నారు..
