కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చెయ్యగా.. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. స్పీకర్ గా హెచ్కే పాటిల్ ఉండబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం తదితరులు హాజరయ్యారు. గవర్నర్ కార్యాలయం లోక్ భవన్లో చాలా సింపుల్గా ఈ కార్యక్రమం ఉండేలా డీకే ప్లాన్ చేసుకున్నారు.
శివకుమార్కి యడ్యూరప్ప, దేవెగౌడ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.
