ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

📰 Generate e-Paper Clip

తిరుమల, సెప్టెంబర్ 14 (గరుడదాత్రి న్యూస్):

తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన కలెక్టర్ కుటుంబ సభ్యులు శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు కలెక్టర్‌కు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని, స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!