*దేవదొడ్డి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం—ఇద్దరికి తీవ్ర గాయాలు.*
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్6
బైరెడ్డిపల్లి మండలం లోని దేవదొడ్డి గ్రామ సమీపంలోని ప్రమాదాల మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.కుప్పం నుండి కడప కు వెళుతున్న కారు ఉదయం రహదారి ప్రక్కన ఉన్న చెట్టు ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తౌసిఫ్ అలీ,ఆలిఫ్ తీవ్ర రక్తగాయలకు గురైయ్యారు.108 సిబ్బంది మహమ్మద్ గౌస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అతి కష్టం మీద కారు డోర్ ను గునపం తో పెకిలించి బాధితులను కారు నుండి వెలికి తీశారు. వారిని చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆతరువాత కారు లోని ల్యాప్ టాప్,నగదు,
3 సెల్ ఫోన్లు భాధిలకు మహమ్మద్ గౌస్ అందజేసి మానవత్వం చాటుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ గౌస్ ను అభినందించారు.
