గరుడధాత్రి :
శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం
దుబాయ్కు చెందిన భక్తులు శ్రీ మనోజ్, శ్రీమతి నేహా దంపతులు సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దాతలు హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
భక్తుల ఈ ఉదార విరాళంపై టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా పేద రోగులకు వైద్య సహాయం అందించడంలో ఇటువంటి విరాళాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
