*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూరపాటి శంకర్ రెడ్డి…*
సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని బత్తినాయుడు ST కాలనీ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.
ఏన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే పెన్షన్లను రూ. 4000కు పెంచి అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు నింపారని తెలిపారు.
అదేవిదంగా నియోజకవర్గంలో
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని కూరపాటి శంకర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
