పిచ్చాటూరు, జూన్ 7 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పిచ్చాటూరు మండలంలో నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. తదుపరి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
