కార్వేటినగరం : జూలై 21 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరంలోనే సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్యాధికారిని డి సి హెచ్ ఎస్ డాక్టర్ పద్మాంజలి ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సిహెచ్ లోనే వార్డులలో ఉన్న రోగులను ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. రోగుల పట్ల ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సిహెచ్ భవనాన్ని పరిశీలించారు. అదేవిధంగా పోస్ట్మార్టం రూమును ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పరిశీలించారు. ఆమె వెంట వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
