పలమనేరు జులై 20 ( గరుడ ధాత్రి ) :
ప్రతి సోమవారం శ్రీ వందన మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల కోసం పలమనేరు నుండి దేవళం పేటకు ఉచిత ఆటో సేవలను గంటావూరు బీసీ కాలనీ గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ ఆర్. మురుగన్ సోమవారం ప్రారంభించారు. భక్తులు ఉచితంగా వెళ్లి తిరిగొచ్చేలా (పోను-రాను) ఈ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేసేందుకే ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఉచిత ఆటోలు పలమనేరు పట్టణంలోని సరస్వతి కేఫ్ ఎదురుగా, కుమారన్ హోటల్ సమీపంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
