కార్యేటి నగరం జూలై 22 (గరుడ దాద్రి న్యూస్):
కార్వేటినగరం మండలంలో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో కార్వేటినగరం ఎస్ఐ తేజస్విని సిబ్బంది కలిసి స్థానిక డిగ్రీ కళాశాల మలుపు వద్ద, పాదిరికుప్పం పంచాయతీ చింత మండి మలుపు వద్ద, గోపి శెట్టిపల్లి పంచాయతీ తురకమిట్ట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఏర్పాటు చేశారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీళ్ళతో బ్రతుకు ఈడుస్తున్న కుటుంబాలు ఎన్నో రోడ్డు, భవనాల శాఖ అధికారులు స్పందన లేకపోవడంతో జనణ మరణాలు లెక్కలు వేసుకోవడమే బాధ్యతలుగా చేపట్టి బదిలీ అయిపోతున్న కొందరు అధికారులు
జనం కోసం ఆలోచించే అధికారినివా అంటూ వాహనదారులు, గ్రామ ప్రజలు ప్రశంసిస్తూ కొనియాడుతున్నారు.
సూచిక బోర్డులను ఏర్పాటు చేసిన దాత కే యం పురం గ్రామ నివాసి బెంగళూరులో స్థిరపడిన తిరుమల రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
