ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు అర్బన్ ఎస్సైగా జయరాం నాయక్

పుత్తూరు అర్బన్ ఎస్సైగా జయరాం నాయక్

📰 Generate e-Paper Clip

నారాయణవనం జూలై 20 (గరుడదాత్రి న్యూస్)
పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా
కె. జయరాం నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.జయరాం నాయక్ ఇంతకుముందు శ్రీ సిటీలో అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా విధులు నిర్వహించారు. ఇటీవల పదోన్నతి పొందడంతో పుత్తూరు అర్బన్ ఎస్సైగా నియమితులయ్యారు.అంతకుముందు హెడ్ కానిస్టేబుల్‌గా సత్యవేడు, పుత్తూరు, నారాయణవనం ప్రాంతాల్లో సేవలందించిన ఆయన, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన కలిగి ఉన్నారు.ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!