ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికావమ్మ తిరునాళ్లకు పోలీసు బందోబస్తు కల్పించాలి

కావమ్మ తిరునాళ్లకు పోలీసు బందోబస్తు కల్పించాలి

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం రెడ్డి వీధిలోని శ్రీ కావమ్మ సమేత మారయ్య దేవాలయంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న తిరునాళ్ల సందర్భంగా ఆలయ నిర్వాహకులు సోమవారం ఉదయం నాగలాపురం ఎస్ఐ సునీల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా 29వ తేదీన శ్రీ కావమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమం జరగనున్నదని, ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం అవసరమని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!