డిఎంకె అధినేత, మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్
వీరిరువురూ తమిళనాడుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తున్నారు.
రాష్ట్ర ఖజానాను గత డీఎంకే ప్రభుత్వం ఖాళీ చేసిందని ఇప్పటికే సీఎం విజయ్ ఆరోపించారు.
దీనికి స్టాలిన్ కూడా బదులిచ్చారు.. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయని.. కొవిడ్-19 లాంటి విపత్తును ఎదుర్కొని ధీటుగా నిలబడ్డామని మాజీ సీఎం స్టాలిన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇరువురు నేతల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
