- ప్రజా పరిష్కార వేదికలో.. పది ఫిర్యాదులు
ఫిర్యాదుదారులకు పరిష్కారం జరుగుతుంది : మండల స్థాయి అధికారులు
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో మొత్తం పది ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 6, శిశు సంక్షేమ శాఖకు సంబంధించినది 1, మహిళా సమైక్యకు సంబంధించినది 1, వెంగళత్తూర్ పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శికి సంబంధించినది 1 ఫిర్యాదు అందినట్లు వెల్లడించారు.ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, కేటాయించిన గడువులో సమస్యలను పరిష్కరిస్తామని మండల స్థాయి అధికారులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
