కార్వేటినగరం జూన్ 30 గరుడదాద్రి న్యూస్ :
కార్వేటినగరం మండలం, కత్తెరపల్లి పంచాయతీలో ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ చేయబడును. కావున పై తెలిపిన కార్యక్రమానికి కార్వేటినగరం మండలం లోని రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులు, పార్లమెంటరీ స్థాయి కమిటీ సభ్యులు, నియోజకవర్గం స్థాయి కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, టీడీపీ పార్టీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు తప్పక హాజరు హాజరు కావాలన్నారు.
నేడే ప్రభుత్వ విప్ చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
RELATED ARTICLES
