ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 2 గరుడధాత్రి :

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పిచ్చాటూరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు పొగాకు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ర్యాలీలో పాల్గొన్న వారు “మత్తు పదార్థాలు వద్దు – ఆరోగ్యం ముద్దు”, “మందు, సిగరెట్ వద్దు – పౌష్టికాహారం ముద్దు”, “చుట్ట, బీడీ, సిగరెట్ ప్రాణానికి పెనుముప్పు”, “పొగ త్రాగవద్దు – క్యాన్సర్ వ్యాధికి గురికావొద్దు” అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ముని చారిత్ర, డాక్టర్ ధనుష్, సామాజిక ఆరోగ్య అధికారి శివయ్య, ఆరోగ్య పర్యవేక్షకులు రాజారావు, వెంకటలక్ష్మమ్మతో పాటు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!