పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) :
స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. స్వామివారికి వేకువ జామున నుండి అభిషేకాలు విశేష పూజలను అర్చకులు కుమార్, చంద్రమౌళి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామి వారిని ప్రత్యకంగా అలంకరించారు. అనంతరం దాత మదన్ సహకారంతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాద వితరణ ధాతను ఆలయ చైర్మన్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ మంజునాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్, రెడ్డప్ప, బాబు, సుజాత, మోహనప్రియ తో పాటు అరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
