*కడప – ముద్దనూరు రహదారి 4 లైన్లుగా విస్తరించాలి ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి*
*కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతి….*
*సానుకూలంగా స్పందించిన మంత్రి*
గరుడ దాత్రి న్యూస్ న్యూఢిల్లీ జులై 29:-
వైఎస్సార్ జిల్లాలోని పలు కీలక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులపై కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. అవినాష్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధిపై ఎంపీ గారు మంత్రికి క్రింది విన్నపాలను అందించారు:
వైఎస్సార్ జిల్లాలోని ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించి అభివృద్ధి చేయాలి.
కడప నగరంలోని ఇర్కాన్ సర్కిల్ నుంచి జేఎంజే సర్కిల్ వరకు ఉన్న రహదారిని 4 లైన్లుగా మార్చాలి.
ట్రాఫిక్ నివారణకు మౌలిక వసతులు: కడప కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఇర్కాన్ సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు:
నాణ్యమైన ఫుట్పాత్ల నిర్మాణం
ఇంటర్లాకింగ్ పేవర్ బ్లాక్స్తో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం
వర్షపు నీరు నిలవకుండా ‘స్టార్మ్ వాటర్ డ్రైనేజీ’ ఏర్పాటు పనులు చేపట్టాలి.
ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి గారు సమర్పించిన పై మూడు ప్రతిపాదనలపైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ రహదారుల విస్తరణ మరియు అభివృద్ధి పనులపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
