కాణిపాకం జూలై 29(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం అనుబంధ దేవాలయమైనమణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన దేవాలయం నందు బుధవారం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకుని *శాకంబరీ దేవి* ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కూరగాయలు వివిధ రకాల పండ్లుతో ప్రధాన దేవాలయము మరియు మణికంఠేశ్వర స్వామి వారి ఆలయాల్లో వైభవంగా అలంకరణలునిర్వహించడం జరిగింది, సుమారు మొత్తం 15 టన్నుల కూరగాయలను పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, ముల్బాగల్, హోసూర్, మొదలగు మార్కెట్ చెందిన వ్యాపారస్తులు రైతులు రవీంద్ర రెడ్డి మిత్రబృందం విరాళంగా అందజేశారు, వీరికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసితీర్థప్రసాదాలు శేషవస్త్రం అందజేసిన దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శివప్రసాద్, ఆలయఏఈఓ రవీంద్రబాబు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
15 టన్నుల కూరగాయలతో కాణిపాకం మణికంఠేశ్వర ఆలయం అలంకరణ
RELATED ARTICLES
