*_తెలంగాణలో ఎండలు.. 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్_*
_ఏప్రిల్ 25,2026_
_తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రతరం కావడంతో,హైదరాబాద్ వాతావరణ కేంద్రం 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఏప్రిల్ 25,26 తేదీల్లో పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో,పిల్లలు,వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానుందని, ఏప్రిల్ 30 వరకు ఉత్తర,దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది._
