*_తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనాభా లెక్కలు_*
_ఏప్రిల్ 25,2026_
_తెలంగాణలో తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు.జనగణన రెండు దశల్లో జరగనుంది.మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలి.ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.తుది దశలో ఫిబ్రవరి 9,2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన నిర్వహిస్తారు.జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది._
