ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమహానాడు సందర్భంగా నీరువాయిలో అల్పాహార విందు ఏర్పాటు

మహానాడు సందర్భంగా నీరువాయిలో అల్పాహార విందు ఏర్పాటు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు మే 28 గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో తెలుగు వారి ఆత్మీయ పండుగగా భావించే మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ఈ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే
కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరుల్ ప్రకాష్, ఆయన తనయుడు యువజన నాయకుడు జార్జ్ విజయ్ గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు గురువారం ఉదయం అల్పాహార విందును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!