కె.వి.బి. పురం, జూన్ 3 గరుడధాత్రి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు, కె.వి.బి. పురం మండల టీడీపీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ సూచనలతో, క్లస్టర్-4 ఇంచార్జ్ దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో నెలలో మొదటి బుధవారం నిర్వహించే యూనిట్ సమావేశం ఈరోజు నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఓటరు జాబితాలో జరుగుతున్న మార్పులు-చేర్పులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా క్లస్టర్-4 ఇంచార్జ్ దొరబాబు నాయుడు గారు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాళంగి రిజర్వాయర్ చైర్మన్ రాజా రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ సురేష్ నాయుడు, నాయకులు బండి బాబు, ధనుంజేయులు నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
