పోలీసులకు వైద్య సిబ్బందిచే స్క్రీనింగ్ పరీక్షలు
గరుడధాత్రి న్యూస్ :
స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం వరదయ్యపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ద్వైత ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఏఎన్ఏం లు పోలీసులకు ఎన్సీడి, సీడీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు..
ఎస్సై మల్లికార్జున్, పోలీస్ కానిస్టేబుళ్లు కు బీపీ పరీక్షలు నిర్వహించి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు..
నిత్యం ప్రజాసమస్యలు ప్రజలరక్షణ భద్రతా సేవలతో మానసిక ఒత్తిడి, పని ఒత్తిడికి గురవుతున్న పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారి ద్వైత తెలిపారు
కార్యక్రమంలో ANM లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
