కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిసి, అక్టోబర్ 22న నిర్వహించనున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక ‘అలయ్-బలయ్-2026’ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దత్తాత్రేయ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన సీఎం చంద్రబాబు, ప్రజల మధ్య సామాజిక సామరస్యానికి వేదికగా నిలిచే ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు.
