రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ మన స్వామి
రామకుప్పం జులై 25 గరుడదాత్రి న్యూస్
గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం శక్తితో రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని నేతలు పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా సంఘమిత్రులు కృషి చేయాలని సూచించారు.
శనివారం మండల వెలుగు కార్యాలయంలో గ్రామ సంఘ ప్రతినిధులు, సంఘమిత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునస్వామి మాట్లాడుతూ సంఘమిత్రుల పనితీరును మండల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ అధ్యక్షులు ఆనందరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పట్రా నారాయణ,రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్, మాజీ సర్పంచ్ నాయక్,కడ అడ్వైజరీ కమిటీ సభ్యులురఘు, రెస్కో డైరెక్టర్మనోహర్, రామలింగారెడ్డి, ఏపీఎం శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
