ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రతి విద్యార్థి కి నాణ్యంమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రతి విద్యార్థి కి నాణ్యంమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్
కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం మెగా పి టి ఏం 4.0 ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ పి ఎం థామస్ విచ్చేసి ప్రసంగించారు.
మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ మాట్లాడుతూ
ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సమగ్రాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య భాగస్వామ్యానికి మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో
జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్, ప్రధానోపాధ్యాయులు శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజన్న, సింగల్ విండో అధ్యక్షులు జనార్దన్ రాజు, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, జయప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు రవి యాదవ్, అధికార ప్రతినిధి మురళి రామిశెట్టి రాజశేఖర్, బీగాల రమేష్, పాదిరి కుప్పం గంగయ్య, మాజీ ఉపాధ్యక్షులు రవికుమార్ , సుందర్ రాజ్ ఆదాం, గణేష్ రాజు, సురేష్ రాజు,మండల అధికారులు ఎంపీడీఓ రాధిక సింగిరెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి శివప్రసాద్, ఎంఈఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!