ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ తేదీ ఖరారైంది
ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని,రాష్ట్ర సంస్కృతి,వారసత్వాన్ని ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.శనివారం ఎయిర్పోర్టు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రకు ఈ విమానాశ్రయం ఒక మణిహారమని, ఇది సరికొత్త అవకాశాలను తెస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
