కె.వి.బి పురం మండలంలోని గుంటిపేడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునస్వామి యాదవ్ గుంటిపేడు లోని కార్యకర్త వెంకటయ్య ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న కార్యకర్త నాయకుల భరోసాను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ దొరబాబు నాయుడు, పార్లమెంటు పాలేకర్ సంఘ కన్వీనర్ వెంకటకృష్ణయ్య, యువత అధ్యక్షులు వాసు నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు బండి బాబు, యూనిట్ ఇంచార్జి సురేష్, గుంటిపేడు గ్రామ కమిటీ అధ్యక్షులు మధు యాదవ్, జనేసేన మండల ప్రధాన కార్యదర్శి ముని శేఖర్, బూత్ ఇంచార్జి జయకృష్ణ, ఆయకట్టు చైర్మన్ ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు రవి, పాండు, కిషోర్, తిరుపాల్, వెంకటయ్య జనేసేన నేతలు కుమార్, కిషోర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*
