-ముగ్గురికి గాయాలు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై20
బైరెడ్డిపల్లి మండలంలోని గంగినేయనిపల్లి వద్ద సోమవారం ద్విచక్రవాహనం ,కారు ఢీకొని రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం శివాడి నుండి రామకుప్పం మండలం భాగలనత్తం కు హరిబాబు,భార్య భువనేశ్వరి, కుమార్తె స్వప్న ద్విచక్రవాహనంపై వెళుతుండగా బైరెడ్డిపల్లి మండలం గంగినేయనిపల్లి వద్ద కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో హరిబాబు మృతిచెందారు. భువనేశ్వరి, స్వప్న లకు గాయపడ్డారు. బాధితులను కుప్పం పి.ఈ.ఎస్.ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
